Attack |పాక్ పంజాబ్ లోని రక్షణ వ్యవస్థ పై భారత్ దాడి – అవాక్స్ విమానం కూల్చి వేత

న్యూ ఢిల్లీ | భారత్ కొద్దిసేపటి క్రితం పాక్ లోని పంజాబ్ లో మోహరించిన ఆ దేశ రక్షణ సమాచార వ్యవస్థ పై దాడి చేసింది . పాక్ గగన తలం లో మోహరించిన అవాక్స్ సమాచార యుద్ధ విమానాన్ని కూల్చి వేసింది. దీంతో ఆ దేశ రక్షణ సమాచార వ్యవస్థ మూగబోయింది. ఈ అధునాతన సమాచార వ్యవస్థ విమానం ఖరీదు రూ. 5,600 కోట్లు

కాగా, పటాన్ కోట నుంచి ఎ క్షణంలో నైనా మన యుద్ధ విమానాలు పాక్ పై దాడికి సిద్ధంగా ఉన్నాయి. ఇక అరేబియా సముద్రంలో మన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ కరాచీ పోర్ట్ పై దాడికి సమాయత్త మవుతున్నది.

ఇక మన పదాతి దళాలు ఆటారీ, రాజస్థాన్‌ బోర్డర్ నుంచి పాక్ భూభాగం లోకి చొచ్చుకు వెళ్లేందుకు రెడీ గా ఉన్నాయి.

కాగా నేటి రాత్రి 8గంటల సమయం లో జమ్ము ఎయిర్‌ స్ట్రిప్‌ప పాక్ మిస్సైల్‌ అటాక్‌ చేసింది. దీంతో 8 పాక్‌ మిస్సైల్స్‌ను భారత్ కూల్చేవేసింది. జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు చేసింది. జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్‌ అటాక్‌ చేయగా, 8 పాక్‌ మిస్సైల్స్‌ను భారత్ చాకచక్యంగా కూల్చేసింది. S400 సిస్టమ్‌తో పాక్ మిస్సైల్స్ ను భారత్ ధ్వంసం చేసింది.

మరోవైపు, భారత సేనలు జమ్ము, కశ్మీర్‌, రాజస్థాన్‌ను బ్లాకౌట్ చేసి,ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. పలుచోట్ల పాక్‌ డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేయగా, పోరు హోరా హోరీగా సాగుతోంది.

జమ్ములో ఏడు చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్ము, కశ్మీర్‌, అఖ్నూర్‌, పూంచ్‌లో సైరన్‌లు మారుమ్రోగాయి. పఠాన్‌కోట్‌ ఎయిర్‌పోర్టును పాక్ టార్గెట్‌ చేసింది. అటు, కుప్వారాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

పాక్ దాడుల వల్ల ఆస్తులకు గానీ, ప్రజలకు గాని ఎటువంటి నష్టం కలగలేదని ఆర్మీ ప్రకటించింది పాక్ ప్రయోగించిన డ్రోన్స్, మిస్సైల్ లను ఆకాశం లోనే కూల్చి వేయడం తో ఎటువంటి నష్టం జరగలేదని తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *