కుప్పం, (ఆంధ్రప్రభ):: మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏమీ లేదని, మహిళలకు అవకాశాలు ఇవ్వాలేకానీ అద్భుతా లు సృష్టిస్తారని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థికం గా బలోపే తం అవడం కోస మే సీఎం చంద్ర బాబు డ్వాక్రా స్థాపించారని, మహి ళలు పారిశ్రా మికవేత్తలుగా ఎదిగేం దుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. గురువారం నాడు రెండవ రోజు పర్యటన లో భాగంగా కుప్పంలో ఎలీప్ ఆధ్వర్యంలో మహిళలకు 6 రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్ధేశించి మాట్లాడు తూ ఎలీప్ నా మనసు దోచుకుంద ని మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి సరైన శిక్షణ అందించ డం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారుచేయడంలో ఎలీప్ చేస్తు న్న కృషి నా మనసును దోచు కుం దని ఆమె తెలిపారు. రమాదేవి ఆమె టీం సభ్యులందరూ ఎలీప్ ద్వారా అనేకమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారని అందుకోసం వారు హైదరాబాద్ లో ఇన్నాళ్లు చేసిన కృషి అమోఘం. అందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
మహిళలు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి
చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఎలీప్ ఏర్పాటు చేశారు. ఎలీప్ నా కళ్ల ముందు పుట్టి ఎదిగింది. మహి ళా పారిశ్రామిక వేత్తల కోసం కుప్పం లో ఎలీప్ ఏర్పాటు కాబోతోం ది. దీని ద్వారా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తయారై మరో పదిమంది కి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకుంటారని ఆమె అన్నారు. స్త్రీలు శక్తిమంతులు మగవారిని మించి పనిచేయగలరని నేను ఇది చేయలేను అనే భయం లేకుండా ముందడుగు వేయాలన్నారు. అప్పుడే అద్భుతాలు సాధించగల రని సాధారణ గృహిణిగా ఉన్న నాకు చంద్రబాబు హెరిటేజ్ బాధ్య తలు అప్పగించారు. అన్నీ స్వయం గా నేర్చుకున్నానని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము కూడా మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుబడు తున్నామని ఆమె తెలిపారు. మహి ళా స్వయం ఉపాధికి చేయూత అందిస్తున్నామని ఎలీప్ ఏర్పాటు విషయంపై ఐఏఎస్ అధికారి వికాస్ తో ఎప్పటికప్పుడు మాట్లా డుతున్నానని తెలిపారు. కుప్పం పరిధిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా రాబోతున్నాయని వాటిలో పని చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు.