కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలోని పలు వార్డుల్లో రూ.12.30 కోట్ల పనులకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ముందుగా నగరంలోని అశోక్ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేశారు.
హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు ఎస్ఏపీ క్యాంపు మీదుగా కొత్త బస్టాండ్ వైపు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు.
అనంతరం, రాష్ట్ర మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ.. నగరవాసులకు ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు వార్డుల్లో పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. వీటన్నింటినీ కల్పించేందుకు తాను కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైజాగ్ తరహాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఉండేలా పనిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యస్.రవీంద్ర బాబు, కార్పొరేటర్లు, టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.