ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- ఐఏఎస్ల బదిలీ..
- ఒకేసారి 31 మంది..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 31 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ బదిలీల్లో పలువురు డైరెక్టర్లు, కార్యదర్శులు, సబ్ కలెక్టర్లు ఉన్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొందరికి నియామకాలు లభించగా, మరికొందరిని ఇతర విభాగాలకు బదిలీ చేశారు. గతంలో కలెక్టర్ల బదిలీలతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో అధికారుల స్థానభ్రంశం చోటుచేసుకుంది.
🔹 ప్రధాన నియామకాలు ఇలా ఉన్నాయి:
- కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ – చక్రధర్ బాబు
- వ్యవసాయశాఖ డైరెక్టర్ – మనజీర్ జిలానీ సామున్
- ఏపీపీఎస్సీ సెక్రటరీ – రవి సుభాష్
- ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ – శివశంకర్ లోతేటి
- పౌరసరఫరాల కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ – ఎస్. దిల్లీ రావు
- ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ – పి. రంజిత్ బాషా
- హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీ – అరుణ్ బాబు
- సీసీఎల్ఏ సెక్రటరీ – జె.వి. మురళి
- సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ – టి.ఎస్. చేతన్
- వేర్హౌసింగ్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ – బి. నవ్య
- ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ – ప్రవీణ్ ఆదిత్య
- సమాచార & ప్రజాసంబంధాల శాఖ డైరెక్టర్ – కె.ఎస్. విశ్వనాథన్
- పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ – గోవిందరావు
- ఎస్సీ కమిషన్ సెక్రటరీ – ఎస్. చిన్న రాముడు
- ట్రాన్స్కో జేఎండీ – జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్
🔹 జాయింట్ కలెక్టర్లు & ఇతరులు
- బాపట్ల – ఎస్.ఎస్. భావన
- నంద్యాల – కొల్లాబత్తులు కార్తీక్
- ఏలూరు – అభిషేక్ గౌడ
- కర్నూలు – నూరుల్ కామర్
- రాజమహేంద్రవరం కమిషనర్ – రాహుల్ మీనా
- కాకినాడ – అపూర్వ భారత్
- శ్రీ సత్యసాయి జిల్లా – మౌర్య భరద్వాజ్
- అల్లూరి జిల్లా – తిరుమణి శ్రీపూజ
🔹 ఇతర నియామకాలు
- వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ – శోభిక
- సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీ – విష్ణు చరణ్
- మారిటైమ్ బోర్డు సీఈఓ – అభిషేక్ కుమార్
- పరిశ్రమలశాఖ డైరెక్టర్ – శుభమ్ బన్సల్
- హౌసింగ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ – వెంకట్ త్రివినాగ్
- డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ – కొమ్మిశెట్టి మురళీధర్
- లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ & ఎండీ – ప్రసన్న వెంకటేశ్
- స్టెప్ కమిషనర్ – ఎస్. భారణి
ఈ బదిలీలతో ఏపీలో పరిపాలనా వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.