AP | రైతన్నా మీ కోసం..

AP | రైతన్నా మీ కోసం..

AP, బంటుమిల్లి, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం ముంజలూరు గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు రైతుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్ళి కూటమి ప్రభుత్వం వ్యవసాయంలో రాబడికి తీసుకోవాల్సిన చర్యలు రూపొందించి, పంచసూత్రాల రూపంలో రైతుకు తెలియచేస్తుందన్నారు. పంటలో దిగుబడి సాధించేలా.. రైతుకు తోడ్పాటు ఇచ్చేవిధంగా, రైతు వద్దకు నేరుగా రావడం జరిగిందని, రైతులతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సాగుకు అవసరమైన నీటి లభ్యత, సాధారణ పంటలు, వాణిజ్య పంటలలో రాబడిని బట్టి దిగుబడి ద్వారా ఆర్థిక బలోపేతానికి రైతులకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య పంటలలో అంతరపంటలు సాగు చేయడం, సేంద్రీయ ఎరువుల ద్వారా భూమిలో పోషక విలువలు పెంచుతూ, దిగుబడి పెరిగేలా, సాంకేతికంగా డ్రోన్స్ వినియోగం ద్వారా ఖర్చు తగ్గించి రైతును రాజుగా చూడాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అధికారులను, సిబ్బందిని రైతులకు అవగాహన కల్పించాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply