AP Deputy CM | కొచ్చికి చేరుకున్న పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అక్కడి నుంచి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీల్లో పర్యటనలు చేస్తారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్ని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారని తెలిసింది.
ఈ పర్యటన వెనక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది. బీజేపీ పెద్దల ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఈ టూర్ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్.. కేరళ, తమిళనాడులో ఆలయాల్ని సందర్శిస్తారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా.. అనంత పద్మ నాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరమ రామస్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్ని సందర్శిస్తారని తెలిసింది.
సనాతన ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ యాత్ర..
ఈ పర్యటన ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించినదిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్నారు. ఆయన పర్యటనలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరమ రామస్వామి దేవాలయం, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై దేవాలయం, తిరుత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలున్నాయి.