AP | యువతకు గ్రీన్ ఎనర్జీలో శిక్షణ కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ తో ఎపి ప్రభుత్వం ఒప్పందం

అమరావతి: ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ఎపి ప్రభుత్వం, ష్నైడర్ ఎలక్ట్రిక్ నడుమ ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ , ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్‌ ప్రతినిధులు నేడు ఎంఓయుపై సంతకాలు చేశారు.

ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం లక్ష్యం. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి, 2027వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, NAC శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్ లను ఏర్పాటుచేస్తారు. ఈ ల్యాబ్ లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో 9వేల మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామగ్రి కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సుమారు రూ. 5కోట్లు ఖర్చుచేస్తుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తుంది.


మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు రూ.15 కోట్ల అంచనా తో మంగళగిరి లో ష్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కు కంపెనీ అంగీకారం తెలిపింది. అనంతపురం లో ష్నైడర్ ఎలక్ట్రిక్
రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు, అల్లూరి సీతారామరాజు జిల్లా లో ష్నైడర్ ఎలక్ట్రిక్ మోడ్రన్ పవర్ ఆప్టిమైజేషన్ పైలెట్ ప్రాజెక్టు నిర్వహించనున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులను శిక్షణ కార్యక్రమాలపై చైతన్యవంతం చేస్తుంది. శిక్షణ కార్యక్రమాల కోసం 4 న్యాక్ సెంటర్లు (అమరావతి, కుప్పం, డిజిటల్ కమ్యూనిటీ భవన్-PM లంక, చిత్తూరు), 9 ప్రభుత్వ ఐటిఐలు (అరకు, రాజమండ్రి (బాలికలు), నర్సీపట్నం, నూజివీడు, ఒంగోలు (బాలుర), ఎ.ఎస్. పేట, కార్వేటినగరం (బాలికలు), కడప (మైనారిటీలు), శ్రీశైలం), 7 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చంద్రగిరి, నంద్యాల, గన్నవరం, ఒంగోలు) ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్య అంతరాన్ని తగ్గించి గ్రీన్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ మేనేజింగ్ డైరెక్టర్ & సిీీీీ ఈ వో జి.గణేష్ కుమార్, ఏపీఎస్ ఎస్ డీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంట్రీ హెడ్ & మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శర్మ, సీనియర్ జనరల్ మేనేజర్ రిచా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఒరాకిల్ తోనూ ఎం వో యు …

ఏపీలో అభివృద్ధి చెందుతున్న ఐటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చి, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ
ఒరాకిల్ ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. మూడేళ్లలో మొత్తం 4లక్షలమందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా శిక్షణ అందించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *