America | మ‌ళ్లీ సుంకాలు బాదుడులో ట్రంప్

వాషింగ్ట‌న్ – సుంకాల విధింపు కోర్టు తీర్పు అనుకూలంగా రావ‌డంతో అమెరికి అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆనంద‌ప‌డిపోతున్నారు.. ఇంకా తీర్పు కాపి చేతికి అంద‌కుండానే సుంకాల పెంపున‌కు శ్రీకారం చుట్టారు.. ఈసారి ఆయ‌న క‌న్ను స్టీల్ పై పడింది.. పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో స్టీల్‌పై ప్రస్తుతం ఉన్న 25% సుంకాన్ని త్వరలోనే 50%కి పెంచనున్నట్లు తెలిపారు. ఇది తాత్కాలికం కాదని, వచ్చే వారం నుంచే అమల్లోకి రానుందని స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ప్రకటన జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ , అమెరికన్ యుఎస్ స్టీల్ మధ్య జరిగిన భాగస్వామ్య ఒప్పందాన్ని ఆయన ప్రమోట్ చేస్తుండగా జరిగింది. ఈ రెండు కంపెనీలు కలిసి అమెరికాలో 70,000 ఉద్యోగాలను కల్పించేందుకు, అమెరికా ఆర్ధిక వ్యవస్థలోకి 14 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

స్టీల్ మార్కెట్‌లో

ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఈ గ్రూప్ చాలా హ్యాపీగా ఉందన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ మీ పరిశ్రమను దోచుకోలేరని ట్రంప్ అన్నారు. 25% సుంకం ఉన్నప్పుడు కొంతవరకు ఆ అడ్డంకిని దాటి వచ్చేవారు. కానీ ఇప్పుడు 50% అయితే, ఎవ్వరూ దాటలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చైనాకు ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక స్టీల్ ఉత్పత్తి, ఎగుమతులు చేసే దేశం చైనానే. 2018లో అమెరికా 25% టారిఫ్ విధించినప్పటి నుంచి చైనా నుంచి అమెరికాకు స్టీల్ ఎగుమతులు క్రమంగా తగ్గాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *