Allu Arjun | ఈ అవార్డులు అభిమానుల‌కు అంకితం – రేవంత్ స‌ర్కార్ కు థ్యాంక్స్

హైద‌రాబాద్ | తొలిసారిగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల‌లో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. “పుష్ప 2: ది రూల్” చిత్రానికి ఆయన ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తనకు గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా ఈ పురస్కారం తనకు దక్కిందని వెల్లడించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. “ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


ఈ అవార్డు దక్కడం వెనుక చిత్ర బృందం కృషి ఎంతో ఉందని అల్లు అర్జున్ అన్నారు. “ఈ క్రెడిట్ అంతా నా దర్శకుడు సుకుమార్ గారికి, నా నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది” అని ఆయన వివరించారు. సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరినీ ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చివరగా, ఈ పురస్కారాన్ని తన అభిమానులకే అంకితమిస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. “ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ నిరంతర మద్దతు నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

https://twitter.com/alluarjun/status/1928024073768161748

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *