ALERT | ఎగువ ప్రాంతాల్లో వర్షాలు.. కృష్ణా నదికి వరదలు !

కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆలమట్టి ఆనకట్ట నుంచి అధిక నీటి విడుదల కారణంగా ప్రియదర్శి జూరాలకు పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. దీంతో డ్యాం అధికారులు హెచ్చరిక జారీ చేశారు. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగే అవ‌కాశం ఉండ‌టంతో… దీనిని దృష్టిలో ఉంచుకుని, డ్యాం నుండి నదిలోకి నీటి విడుదలను క్రమంగా 16,000 క్యూసెక్కుల వరకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత నీటి స్థితి:

నీటి మట్టం: 317.270 మీటర్లు (1,040.912 అడుగులు)
జీవ నీటి నిల్వ: 3.517 టీఎంసీలు (మొత్తం సామర్థ్యం 7.224 టీఎంసీలు)
ప్రవాహం (ఇన్‌ఫ్లో): 40,000 క్యూసెక్కులు
విడుదల (అవుట్‌ఫ్లో): 52,468 క్యూసెక్కులు

విడుదల వివరాలు:

స్పిల్‌వే గేట్లు (4): 15,516 క్యూసెక్కులు
పవర్‌హౌస్: 34,422 క్యూసెక్కులు
నెట్టంపాడు లిఫ్ట్: 1,500 క్యూసెక్కులు
భీమా లిఫ్ట్-I: 650 క్యూసెక్కులు
కోయిలసాగర్ లిఫ్ట్: 315 క్యూసెక్కులు

ప్రజలకు సూచనలు:

దిగువ ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని సూచనలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply