MDK | రెవెన్యూ సదస్సులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ : నార్సింగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నగేష్ (Additional Collector Nagesh) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలను చేశారు. మండల వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులో 607 దరఖాస్తులు స్వీకరించారు.

నార్సింగి (Narsinghi) మండల వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సు 9 గ్రామాల్లో నిర్వహించారని, మొత్తం 607 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ కరీం అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం భూ భారతి రెవెన్యూ సదస్సును రెండు రోజులు 11, 12 తేదీల్లో నిర్వహించి నేటితో ముగించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల ను నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సు (Revenue conference) అందరూ ఉపయోగించుకున్నారన్నారు. ఇంకెవరైనా మిగిలి ఉంటే ఆ ధైర్య పడవద్దని, ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణిలో మీ అర్జీలను సమర్పించవచ్చని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రైతుల, భూ సమస్యలపై ఆర్జీలు పెట్టుకున్న రైతుల సమస్యలను త్వరగా పై అధికారులకు నివేదిక పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *