కర్నూలు బ్యూరో శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న వాహనానికి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా సమీపంలో శుక్రవారం సాయంత్రం వాహనం బోల్తా పడింది.ఆదోని కి చెందిన కొందరు శ్రీశైలం నుంచి వాహనంలో కర్నూలుకు వస్తుండగా నల్లమల అడవిలోని ఘాట్ రోడ్ లో బైర్లూటి సమీపాన సిద్దాపురం చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
అదుపు తప్పి వాహనం పల్టీలు కొట్టడంతో ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన . చంద్రమ్మ (31) గిడ్డయ్య (42) శశికళ (40), లక్ష్మి(28) లు అక్కడికక్కడే మృతి చెందారు.
అందులో ఉన్న 13 మంది కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. గిరిదర్, వీరభద్రరావు, రంగస్వామి రవి రాజుల పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారితో పాటు అందరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాము తెలిపారు.ప్రమాద సమయంలో వాహనంలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీశైలం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.గాయపడిన వారిని హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో కొందరిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.