Accident | ఆటోని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు.. ఇద్దరు మృతి

మెదక్ జిల్లా మంబోజిపల్లి శివారులోను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట నేడు రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ డిపో ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, కౌడిపల్లి నుండి మెదక్ వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సిది ఉంది.

Leave a Reply