ICC Champions Trophy | టీమిండియా తొలి వికెట్ డౌన్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్ – పాక్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతొంది. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు… 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది.
ఈ క్రమంలో 242 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
5వ ఓవర్లో షాహీన్ అఫ్రిదీ వేసిన బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఓపెనర్ గా క్రీజులోకి రోహిత్ ధనాధన్ బ్యాటింగ్ తో 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ తో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇక ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (10) – విరాట్ కోహ్లీ ఉన్నారు. టీమిండియా స్కోర్ 31/1.