యువకుడికి గాయాలు..
ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మంజంపల్లి(Manjampally) గ్రామ శివారులో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. కారు, బైక్ ఢీకొనడంతో వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన తోట నాగరాజు(ota Nagaraja) గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అంబులెన్స్(Ambulance)కు సమాచారం అందించగా, గాయపడిన యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.