శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున – ధనుష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ సినిమాలోని నాగార్జున, ధనుష్, రష్మిక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు మరియు గ్లింప్స్ ను ఇటీవల విడుదల చేయగా మంచి బజ్ క్రీయేట్ అయ్యింది. తాజాగా, ఈ రోజు ‘కుబేర’ టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో జూన్ 20న థియేటర్లలోకి రానుంది.