WGL |వడదెబ్బకు రైతు మృతి

పెద్దవంగర, మే 12(ఆంధ్రప్రభ) : ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు హఠాన్మరణం చెందిన ఘటన మండలంలోని రామోజీ తండాలో చోటుచేసుకుంది. రామోజీ తండాకు చెందిన గుగులోత్ కిషన్ (60) పదిరోజుల క్రితం వరి కోత పూర్తయిన అనంతరం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో వడ్లు ఆరబోస్తుండగా గుగులోత్ కిషన్ అకస్మాత్తుగా ఎండ దెబ్బకు గురై అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నీళ్లు, నీడకు టెంట్, ఓఆర్ఎస్ లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply