ఆంధ్రప్రభ బ్యూరో .. రాయలసీమ – ఏపీ ఆర్థిక చరిత్రలో ఎల్జీ సంస్థ ఏర్పాటు చరిత్రలలో నిలిచిపోయే అంశమని తెలిపారు మంత్రి నారా లోకేష్. ఎల్జీ తమ సంస్థలు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఎల్జీ సిటీ ఏర్పడనుందని అన్నారు. సత్యవేడు నియోజక వర్గం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు ఈరోజు న భూమి పూజ చేశారు. రూ. 839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేయడంతో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్రంలో మరో అడుగు పడింది. రూ. 5,001 కోట్ల పెట్టుబడిలో భాగంగా 2 వేల ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాక దేశంలో నే 70 శాతం ఏసీలు ఏపీ నుంచి సరఫరా అయ్యే సంస్థ ను ఏర్పాటు చేయడానికి విదేశాల నుంచీ కొరియా దేశ ప్రముఖులు తరలి వచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్తు లో ఎల్ జి అనుబంధ విభాగాలు మరిన్ని ఏర్పాటు చేసి ఎల్ జి సిటీ ని ఏర్పాటు చేయాలన్న లోకేష్ విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. గతంలో చంద్రబాబు కృషి తోనే తమ దేశానికి చెందిన కియా సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కావడాన్ని గుర్తుచేస్తూ మరిన్ని కొరియన్ సంస్థలు రాష్ట్రం లో పెట్టుబడులు పెడతాయని అన్నారు.
విదేశీ సంస్థల ప్రతినిధుల రాకపోకలకు రాబోయే నాలుగు సంవత్సరాల్లో తిరుపతికి అంతర్జాతీయ విమానయానం పెరిగేలా చేస్తామని చెప్పారు. పరిశ్రమలు తీసుకు రావటానికి మంత్రులు, కలెక్టర్లు మాత్రమే కాదని..ప్రతి నియోజక వర్గం మరో నియోజక వర్గంతో పోటీ పడాలని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఎల్జీ సంస్థ రూ.5000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు పెట్టే నమ్మకాన్ని తెచ్చిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

అంతకుముందు జరిగిన భూమిపూజలో ఆశక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన ఎల్ జి సంస్థ పారిశ్రామిక వేత్తలు, ఇతర పెద్దలు కాళ్లకు షూలను ధరించి పూజా కార్యక్రమం వద్దకు వచ్చారు. అది గమనించిన మంత్రి నారా లోకేష్ సంప్రదాయాన్ని వివరించి అందరూ షూలు తొలగించి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఆ కంపెనీ ప్రతినిధులు కూడా హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తూ అంతా తమ షూలను విడిచిపెట్టి, లోకేష్ లాగే నేలపై కూర్చొని కొబ్బరికాయలు కొట్టి భూమి పూజను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వారిని మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.