gudur mandal | బావిలో పడి ఇద్దరు బాలికల మృతి

gudur mandal | బావిలో పడి ఇద్దరు బాలికల మృతి
gudur mandal |ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది
gudur mandal | గూడూరు శనివారం 11ఆంధ్రప్రభ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం గూడూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. గూడూరు మండలంలోని మట్టెవాడ గ్రామ శివారు నేలవంచ గ్రామానికి చెందిన పెనుక కవిత రవికుమార్ దంపతుల కుమార్తె పెనుక చైత్ర( 9)కత్తుల శ్రీజ (9) తండ్రి అశోక్ అను విద్యార్థులు ప్రమాదవశాత్తు బావి లో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

ఎంతసేపటికి విద్యార్థినిలు ఇంటికి రాకపోవడంతో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా బావిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డారా లేదా ఈతకు వెళ్లి నీటిలో మునిగి మరణించారా అనే వివరాలు తెలియవలసి ఉంది.
read this also నీట మునుగుతున్న ఇద్దరిని కాపాడిన గంగ పుత్రుడు
