- 26 వరకు రిమాండ్
- గుంటూరు సబ్ జైలుకు పోసాని
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యల కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళీని గుంటూరు తరలించారు పోలీసులు. కర్నూలు జైలు నుంచి ఆయన్ని నేరుగా జీజీహెచ్కు తీసుకువచ్చిన సీఐడీ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం జడ్జ్ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో పోసాని తరుఫున న్యాయవాదులు పొన్నవోలు, పోలూరి వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని వాదనలు వినిపించారు. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే నరికేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల వయస్సలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కక్షలతోనే తనపై కేసులు పెట్టారంటూ బోరున విలపించారు.
అయితే, సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో పోసానికి గుంటూరు కోర్టు విధించింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత.. ఈ నెల 26 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో గుంటూరు సబ్ జైలుకు పోసానిని తరలించారు పోలీసులు.