Telangana | 32మంది ఐపీఎస్ ల బదిలీ
Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం (Government). మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(CS Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
ఏడీజీ పర్సనల్గా చౌహాన్, సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కొటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

