రాయ్పూర్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.23 లక్షల రివార్డు (Reward) ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం (Rehabilitation) కల్పిస్తామని ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Maoists surrender | 13మంది మావోయిస్టుల లొంగుబాటు
