Yoga Day : ఎల్బీస్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ ఈవెంట్ … పాల్గొన్న పలువురు ప్రముఖులు

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga day ) ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( kishan reddy ) ఆధ్వర్యంలో యోగా డే 24 గంటల కౌంట్ డౌన్ ఈవెంట్ ను నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnudev varma) , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu ) తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.నగరం నలుమూలల నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు హైదరాబాదీలు తరలివచ్చారు. 21న కేంద్ర గనులు, మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఈవెంట్ లో యోగా శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు.యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎల్బీస్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply