యాదగిరి కొండ, ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) పుణ్యక్షేత్రంలో ఆలయాలు మూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వయంభూ పంచ నారసింహుల దేవాలయం (temple)తో పాటు, అనుబంధ శివాలయం(Shiva temple). పాతగుట్ట శ్రీలక్ష్మీ నారసింహ స్వామి (Sri Lakshmi Narasimha Swamy) ఆలయాలను మూసివేశారు.
సోమవారం ఉదయం 3.30 గంటలకు ప్రధాన ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. నిత్య కైంకర్యాల అనంతరం భక్తులను యధావిధిగా దర్శనానికి అనుమతించనున్నారు.

