Yadadri | పాడి రైతుల ధర్నా..

Yadadri | పాడి రైతుల ధర్నా..

Yadadri | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : మదర్ డెయిరీ (Mother Dairy) లో బకాయి పడిన పాల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలోని పాల ఉత్పత్తిదారుల ఆధ్వర్యంలో పాల సంఘం ఆవరణంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు (Farmers) మాట్లాడుతూ… గత నాలుగు నెలల నుండి 8 పాల బిల్లులు బకాయి ఉన్నాయని, పాలకులు వెంటనే బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించని పక్షంలో మదర్ డైరీ ((Mother Dairy) ని రైతులందరూ కలిసి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మాజీ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply