స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
హైదరాబాద్, ఆంధ్రప్రభ : యంగ్ హీరో తేజ సజ్జా – డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయ్ (Mirai) టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ థ్రిల్లర్(Fantasy thriller) పాజిటివ్ టాక్తో కాసుల వర్షం కురిపించింది.
సుమారు రూ.60 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫాంటసీ అడ్వెంచర్, థియేటర్ల(theaters)లో దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన మిరాయ్ కేవలం నెల రోజుల్లోపే ఓటీటీ(OTT)లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
జియో హాట్స్టార్ ఈ సినిమా డిజిటల్(digital) హక్కులను సొంతం చేసుకోగా… అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
స్టార్ కాస్ట్ & టెక్నికల్ టీమ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కృతి ప్రసాద్ కో-ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో మెప్పించగా, మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్(Black Sword)గా విలన్ పాత్రలో అదరగొట్టారు. సీనియర్ హీరోయిన్ శ్రియా తల్లి పాత్రలో ఆకట్టుకోగా, జగపతి బాబు, జయరామ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.