Weather Report | ఎపికి వాయు’గండం’ – దక్షిణ కోస్తా జిల్లాలో కుంభవృష్టి

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

సముద్ర తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

నిన్న గురువారం సాయంత్రం 5 గంటల నాటికి పల్నాడు జిల్లా రెంటపాళ్ళలో 47.5మిమీ, గరికపాడులో 41, సత్తెనపల్లిలో 34.5మిమీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో …

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి.. ఛత్తీస్‌గఢ్, ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపించాయి. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లలో 37, కనిష్టంగా మహబూబ్ నగర్ లో 29.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *