న్యూ ఢిల్లీ: పాకిస్థాన్ కు మరో దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన విషయం తెలిసిందే.. తాజాగా.. బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాకిస్థాన్ కు నీటి సరఫరాను నిలిపివేసింది. డ్యామ్ స్లూయిస్ స్పిల్ వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. మరోవైపు జీలమ్ నదిపై ఉన్న కిషన్ గంగా డ్యామ్ నుంచి నీటి ప్రవాహాలు వెళ్లకుండా చర్యలకు భారత్ సిద్ధమవుతోంది.
బాగ్లిహార్ డ్యామ్ ను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్థాన్ కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. ఈ డ్యామ్ పొడవు దాదాపు 145 మీటర్లు. బాగ్లిహార్ డ్యామ్ పై హైడ్రో పవర్ జనరేషన్ తోపాటు పంజాబ్ ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సిందూ నీటి ఒప్పందాన్ని నిలిపివేయంతో పాటు వీసాల రద్దు, పాకిస్తానీయులను వెనక్కి పంపించడం,దౌత్య సిబ్బందిని తగ్గించడం, అటారి సరిహద్దు మూసివేత, పాక్ కు సంబందించిన సామాజిక మాధ్యమాలు నిషేదం, వ్యాపార ఆంక్షలు విధించిన భారత్.. పాకిస్థాన్ పై నీటి యుద్ధాన్ని కూడా ముమ్మరం చేస్తోంది.