విశాఖపట్నం; ప్రపంచ యోగ దినోత్సవం (World Yoga day ) సందర్భంగా విశాఖ నగరంలో ఆర్కే బీచ్ (RK beach ) వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi ) , ముఖ్యమంత్రి చంద్ర బాబు (chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan ) , పలువురు మంత్రులతో పాటు లక్షలాదిమంది కూడా హాజరై యోగాసనాలు వేశారు
ఈ సందర్భంగా ప్రధాన మోడీ మాట్లాడుతూ ఈ యోగా దినోత్సవం ‘మానవాళి కోసం యోగా 2.0’ కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు. .యోగ అనేది ప్రపంచాన్ని కలుపుతుంది.. 175 దేశాలలో యోగా చేయడం సాధారణ విషయం కాదు అంటూ తెలిపారు. ఇదంతా కూడా మనతోనే సాధ్యమైందని వెల్లడించారు.

నేవీకి చెందిన నౌకలలో కూడా యోగాసనాలు వేస్తూ ఉన్నారు. యోగాంద్రను నిర్వహించిన చంద్రబాబు, పవన్, లోకేష్ లకు అభినందనలు అంటూ తెలిపారు.అందరి క్షేమమే నా కర్తవ్యం అని భారతీయ సంస్కృతి నేర్పిందని ప్రపంచంలో ఏదో ఒక సమస్యను ఎప్పుడూ ఎదుర్కొంటూ ఉంటుంది.ఇలాంటి పరిస్థితులలోనే యోగ శాంతికి తోడ్పడుతుందని తెలిపారు
మోదీ.యోగ మనలో మానవత్వాన్ని పెంచుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటూ వెల్లడించారు.నేను అనే వాటి నుంచి మనం అనే భావనకు తీసుకువెళ్లే ఒక ఆయుధమే యోగ.ప్రపంచానికి పెద్ద సమస్యగా మారినటువంటిదే ఒబేసిటీ.. మనం తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలు 10 శాతం తగ్గించాలి యోగాను ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక ఉద్యమంలో చేస్తే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటూ వెల్లడించారు.
విశాఖపట్నం సాగర్ తీరంలో 11వ అంతర్జాతీయయోగా దినోత్సవం చాలా గ్రాండ్ గా జరిగింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 28 కిలోమీటర్ల వరకు సుమారుగా ఐదు లక్షల మందితో యోగాసనాలు వేశారు.