Visakha | ఒత్తిడిని జయిస్తేనే విజ‌యం సాధిస్తాం – ప‌వ‌న్ క‌ల్యాణ్

విశాఖ‌ప‌ట్నం – యోగా విశిష్టతను రుగ్వేదం (Rigveda ) చెబితే, మోదీ విశ్వవ్యాప్తంగా (World wide ) యోగాను ప్రోత్సహించారని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ (dy cm pawan kalyan) అన్నారు. విశాఖ సాగరతీరంలో ఉదయ భానుడిని స్తుతిస్తూ . తన ప్రసంగం ప్రారంభించిన ప‌వ‌న్ ఇంటర్నేషనల్ యోగా డే భారతావనికి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు. యోగాను అందించిన ఆదియోగి, పతంజలికి (patanjali) నమస్కారాలు తెలియజేశారు. యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు ప్రాధాన్యం దక్కండంలో ప్రధానమంత్రి మోడీదే కీల‌క‌పాత్ర అంటూ ప్ర‌శంసించారు.

పోస్టల్ స్టాంపు విడుద‌ల

అంత‌కు ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంపులను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు కలిసి విడుదల చేశారు.

రికార్డులే.. రికార్డులు..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఒకే స్ట్రెచ్‌లో మూడు లక్షల 20వేల మందికిపైగా యోగా చేయడం ప్రపంచంలోనే రికార్డు. దీంతోపాటు 25వేల మంది గిరిజన విద్యార్థులు శుక్రవారం ఒకేచోట చేసిన సూర్య నమస్కారాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను అందజేశారు.

Leave a Reply