భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ జరిగింది.
మంగళవారం (సెప్టెంబర్ 9) ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 96 శాతం మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల సంఘం పార్లమెంట్ భవనం లోపల ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటు వేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.

