Vangalapudi Anitha | గంగానమ్మ సన్నిధిలో..

Vangalapudi Anitha | గంగానమ్మ సన్నిధిలో..

Vangalapudi Anitha, ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : శతాబ్ద కాలం పైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న ఏలూరు తూర్పు వీధి శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర 2025 – 26లో భాగంగా అమ్మవార్లను తమ కుమార్తెతో కలిసి సోమవారం తెల్లవారుజామున రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. హోం మంత్రి అనితకు మంగళ వాయిద్యాలతో ఆలయ మర్యాదలతో జాతర కమిటీ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. జాతర సందర్భంగా మేడలలో కొలువుదీరిన శ్రీ కొర్లపాటి అంకమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను దర్శించుకుని అమ్మవార్లకు సారే సమర్పించి హోం మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం హోం మంత్రి అనితకు అమ్మవారి చీరను కానుకగా సమర్పించి తీర్థప్రసాదాలు ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ జాతర కమిటీ సభ్యులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిల్లపల్లి సారథి సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. హోమ్ మంత్రి పర్యటన సందర్భంగా ఆలయం వద్ద జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివ కిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ ఈ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply