TTD | ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ. 1.50 కోట్లు విరాళం !

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది. ఆదివారం తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి సంస్థ ఎండీ పొన్నుస్వామి రూ.50 లక్షల విరాళం చెక్కును అందజేశారు. టీటీడీకి విరాళం అందించినట్లు దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *