Trump Effect | స్టాక్ మార్కెట్ లో ‘బ్లడ్ బాత్’ ‍‍‍

తొలి నిమిషంలో 3200 పాయింట్లు డౌన్
నిఫ్టి కూడా ఏకంగా 1100 పాయింట్ల పతనం
ఒక్క అరగంటలో రూ.19 లక్షల కోట్ల సంపద ఆవిరి
మొత్తం స్టాక్ మార్కెట్ విలువ రూ. 248 లక్షల కోట్లు
ఎనిమిది రోజులలో రూ 41 లక్షల సంపద మటాష్

ముంబై ‍ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్.. దేశీయ స్టాక్ మార్కెట్‌ ప్రళయాన్ని పుట్టించింది. భారీగా నష్టపోయింది. ఇన్వెస్టర్లను వణికిస్తోంది. చుక్కలు చూపెడుతోంది. లాభాలు అనే మాట అటుంచి.. పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తొలి గంటలోనే సెన్సెక్స్, నిఫ్టీ కనీవినీ ఎరుగని విధంగా పతనం అయ్యాయి. సెన్సెక్స్‌లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్‌లో కనిపించాయి. మైనస్‌లల్లో పడిపోయాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. తొలి గంటలోనే గరిష్టంగా 3,920 పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్. ఆరంభంలోనే స్వల్పంగా కనిపించిన నష్టాల పాయింట్లు.. ట్రేడింగ్ కొనసాగుతున్న స్వల్పంగా తగ్గాయే తప్ప ఆశించిన స్థాయిలో నష్టాన్ని పూడ్చలేకపోయాయి.

సమయం గడుస్తోన్న కొద్దీ షేర్లన్నీ మైనస్‌లోకి వెళ్లిపోవడం కనిపించింది. ఏ దశలో కూడా సెన్సెక్స్ అప్పర్ సర్కుట్‌కు చేరుకోలేకపోయింది. తొలి అరగంట ముగిసే సమయానికి 2,820.46 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. తొలి సెషన్ తరువాత కూడా ఈ క్షీణతకు అడ్డుకట్ట పడకపోవచ్చనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. కేవలం నిమిషాలల వ్యవధిలో 19 లక్షల కోట్ల సంపద అవిరైంది… మొత్తం స్టాక్ మార్కెట్ విలువ రేూ.248 లక్షల కోట్ల కాగా, గతవారం ట్రేడింగ్ లో రూ.22 లక్షల కోట్లు నష్టపోయంది.. నేడు ఇప్పటికే రూ.19 లక్షల కోట్లు హరతికర్పూరమైంది.. కేవలం ఎనిమిది రోజుల వ్యవథిలో రూ.41 లక్షల కోెట్లు సంపదను మదుపరులు కోల్పోయారు..

ఇక శుక్రవారం 75,637.44 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ ట్రేడింగ్.. నేడు 71,425.01 పాయింట్ల వద్ద ఆరంభమైంది. 3,920 పాయింట్ల నష్టం కనిపించింది. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ కొద్దికొద్దిగా కోలుకుంది. చివరకు 2700 నష్టం వద్ద ప్రస్తుతం కొనసాగుతున్నది.

కనివినీ ఎరగని పతనం ..

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మార్కెట్లు పతనమవుతున్నాయి. ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్, ఇండియాతో పాటు ప్రపంచంలోని అన్ని మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ల ఎర్లీ ట్రేడింగ్స్ లో బ్లడ్ బాత్ కనిపిస్తోంది. సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకు పైగా పతనమయింది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 10 నెలల తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. తొలి అరగంటలో గరిష్టంగా మైనస్ 2,745 పాయింట్ల వద్ద ట్రేడింగ్ రికార్డయింది.

నిఫ్టీ కూడా ఇదేరకమైన పతనాన్ని చవి చూసింది. ప్రారంభంలో ఏకంగా 1,102 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడింగ్ ఆరంభమైంది. ఆ తరువాత కోలుకున్నప్పటికీ- అది నామమాత్రమే. తొలి అరగంటలో మైనస్ 911.55 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 72, 466 పాయింట్లు , నిఫ్టి 24984 పాయింట్లతో కొనసాగుతున్నది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 9 శాతం, టాటా మోటార్స్ 8.61 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 6.29 శాతం, టెక్ మహీంద్రా 5.87 శాతం, ఎల్ అండ్ టీ 5.56 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ సూచీ 5.39 శాతం, రియాల్టీ 4.34 శాతం, టెక్ 4.23 శాతం పతనమయ్యాయి. అన్ని రంగాల షేర్లు తీవ్ర ఒడిదుడుకలకు లోనవుతున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *