Triple century | కొండపై కోడి దర…
- చికెన్ కేజీ రూ.300
Triple century | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కోడి మాంసం ధర కొండెక్కింది. నూతన సంవత్సరం ఆరంభంలోనే ట్రిపుల్ సెంచరీ(Triple century) కొట్టింది. మూడు నెలలుగా రూ.260 వద్ద కొనసాగుతున్న ధర రెండు వారాల వ్యవధిలోనే రూ.300కి చేరింది. ఇప్పటికే గుడ్డు ధర చూసి గుడ్లుతేలేస్తుండగా.. పెరిగిన మాంసం ధర(meat prices)తో కళ్లుతిరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
ఇటీవలి కాలంలో (డిసెంబర్ 2025), చలికాలం, పండుగల సమయంలో హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో చికెన్, గుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్యులు చికెన్ కొనడానికి ఆలోచిస్తున్నారు.

