సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :భూకంపం విలయంతో మమన్మార్ అతలాకుతలం కాగా.. శిథిలాల కింద వందల శవాలు దీనంగా ఉన్నాయి. మరో వైపు వేలాది మంది క్షతగాత్రుల హాహాకారాలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ఈ దృశ్యాలను చూసి కన్నీరు మున్నీరవుతుంటే.. మయన్మార్ సైనిక సర్కారు గుండె కరగలేదు. తిరుగుబాటుదారులపై కిరాతక చర్యలకు వెనకాడటం లేదు. తిరుబాటుదారుల ప్రాంతాల్లో మయన్మార్ సైనిక ప్రభుత్వం బాంబుల వర్షం కురిపిస్తూ.. నీరో చక్రవర్తి పాత్ర పోషిస్తుందనే వార్తలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి..
ఈ దాడులను అత్యంత అమానవీయమైన, ఆమోదయోగ్యంకాని దాడులుగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. భూకంపం బాధిత ప్రజలను రక్షించే పనులు కొనసాగుతుండగానే, తిరుగుబాటుదారులపై దాడులు కొనసాగించడం దారుణమని, ఇది నమ్మలేని అంశమని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్ అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆండ్రూస్ పిలుపునిచ్చారు.
సైనిక ప్రభుత్వాన్ని ఒప్పించగల వారెవరైనా ఒత్తిడి తెచ్చి, ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని చాలా స్పష్టంగా చెప్పాలి” అని టామ్ ఆండ్రూస్ అన్నారు. భూప్రకంపన.. అటు బాంబుల వర్షం మయన్మార్ ఉత్తరాన షాన్ రాష్ట్రంలోని నౌంగ్చోలో జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు తిరుగుబాటు దారులు మరణించినట్టు వార్తా సంస్థలు ప్రకటించాయి. భూకంపం వచ్చిన మూడు గంటల తర్వాతే ఈ దాడి జరిగింది. వాయువ్యాన ఉన్న సగైంగ్ ప్రాంతం భూకంప కేంద్రం. ఇక్కడి చాంగ్-యు టౌన్షిప్లో కూడా వైమానిక బాంబు దాడులు జరిగాయని సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు గ్రూపులు వెల్లడించాయి.
థాయిలాండ్ సరిహద్దు సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. 7.7 తీవ్రతతో సగైంగ్ను భూకంపం తాకింది. మాండలే నగరం ముక్కచెక్కలైంది. ఇక రాజధాని నైపీడాలో లేక్కలేనంత విధ్వంసం జరినట్టు రిపోర్టులు వచ్చాయి.ఇప్పటి వరకు 1644 మంది మరణించారు. ఇంకా వందల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారని సైనికాధికారులే చెబుతున్నారు.
కానీ వైమానిక దాడులు ఎందుకు నిర్వహించారో.. వివరించటం లేదు. విపత్తు కష్టాల్లోనూ.. ఆధిపత్యమే ఇక 2021లో సైన్యం తిరుగుబాటు తర్వాత మియన్మార్లో నాలుగు ఏళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ తిరుగుబాటు భారీ నిరసనలకు దారితీసింది. రోజూ వేలమంది వీధుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య అనుకూల వాదుల ఉద్యమంగా మొదలైన ఆందోళనలు చివరకు జాతుల మధ్య ఘర్షణలతో పూర్తిస్థాయి అంతర్యుద్ధానికి దారితీసింది.
నాలుగు సంవత్సరాల తరువాత కూడా సైన్యం, మరోవైపు వివిధ తెగల సైన్యాలు, సాయుధ గ్రూపుల మధ్య హింసాత్మక పోరాటం కొనసాగుతోంది. అనేక పరాజయాలను చవిచూసిన సైన్యం, ప్రతిఘటనను అణచివేయడానికి వైమానిక దాడులపై ఎక్కువగా ఆధారపడుతోంది. భూకంప కేంద్రం సగైంగ్లోని చాలా ప్రాంతాలు ప్రజాస్వామ్య అనుకూల గ్రూపుల ఆధీనంలో ఉన్నాయి. తిరుగుబాటు వర్గాలు దేశంలోని దాదాపు 42 శాతం భూభాగాన్ని నియంత్రిస్తున్నాయని, మిగిలిన ప్రాంతంలోని ఎక్కువ భాగంలో ఆధిపత్యం కోసం వివిధ వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతున్నట్లు తేలింది.
వైమానిక పోరాటంలో సైనిక పాలకులు పైచేయి సాధించారు. సాయుధ ప్రతిఘటన దళాలకు వైమానిక దాడులు చేసేంత సామర్థ్యం లేదు. పాఠశాలలు, మఠాలు, చర్చిలు, ఆసుపత్రులపై బాంబులు వేసి వాటిని నాశనం చేసిన చరిత్ర సైన్యానికి ఉంది. అత్యంత ఘోరమైన వైమానిక దాడులలో ఒకటిగా చెప్పే ఓ దాడిలో మహిళలు, పిల్లలు సహా 170 మందికి పైగా మరణించారు.
దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తున్న ఐక్యరాజ్యసమితి సంస్థ సైనిక జుంటా ప్రభుత్వం తమ సొంత ప్రజలపై యుద్ధ నేరాలకు పాల్పడుతోందని హెచ్చరించింది.
సహాయం ముసుగులోనూ … రష్యా, చైనాల మద్ధతుతో సైన్యం వైమానిక దాడులను కొనసాగుతోంది. ఈ రెండు దేశాలు సైనిక దళాల అధునాతన జెట్లను విక్రయించాయి. వాటి వినియోగానికి ట్రైనింగ్ కూడా ఇచ్చాయి. భూకంపం తర్వాత రష్యా, చైనాలు రెస్క్యూ టీమ్లను మియన్మార్కు పంపాయి. అవి సైనిక ప్రభుత్వానికి ఆయుధాలు అందించే దేశాలు. ఇప్పుడు వారి సానుభూతిని నమ్మడం కష్టం అని యూకేకు చెందిన బర్మీస్ హక్కుల కార్యకర్త జూలీ ఖైన్ అన్నారు.
రెస్క్యూ ఆపరేషన్లను కూడా సైన్యం తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే ఆందోళన ఉంది. ప్రతిఘటన గ్రూపులకు పట్టున్న ప్రాంతాలలో సహాయాన్ని నిరాకరించిన చరిత్ర సైనిక పాలకులకు ఉంది. ఇది చాలా ఏళ్లుగా అనుసరిస్తున్న వ్యూహం. గతంలో సహాయ చర్యలను సైన్యం అడ్డుకుందని, రెస్క్యూ సిబ్బందిని అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి టామ్ ఆండ్రూస్ అన్నారు.
గత మానవతా విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల అనుభవాల నుంచి మనకు తెలిసిన విషయం ఏంటంటే, సైన్యం నిజాలను చెప్పదు, మానవతా సహాయం అవసరమైన చోటికి చేరకుండా నిరోధించే అలవాటు కూడా దీనికి ఉంది అని టామ్ ఆండ్రూస్ అన్నారు. ఈ విపత్తు విషయంలోనూ అదే జరుగుతోందపి ఆండ్రూస్ అన్నారు.
ఆదుకునే దిక్కు కోసం..
అల్లాడుతున్న మయన్మార్ జనంశిథిలాల్లోనే క్షతగాత్రులు ఇప్పటికి 1644 మంది మృతి 3408 మందికి గాయాలు ఆసుపత్రులకు క్షతగాత్రుల ప్రవాహంకదలిన పొరుగు దేశాలు తాత్కాలిక ఆసుపత్రికి భారత్విమానయానానికి బ్రేక్ నాలుగు నౌఖల్లో సామాగ్రి తరలింపురెస్క్యూ ఆపరేషన్ లో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
ఇదోక విధ్వంసం. భరించలేని గుండె వ్యథ. కళ్లముందే నేల కూలిన భవనాలు. రెండు రోజులుగా కరెంటు లేదు. గుక్కెడు నీళ్లు దొరకటం లేదు. ఇక శిథిలాల్లో చిక్కిన బాధితుల గావు కేకలు మార్మోగుతుంటే.. క్షతగాత్రులతో ఆంబులెన్సులు పరుగులు పెడుతుంటే… వీళ్లని లోనికి తీసుకువెళ్లే స్ర్టెచ్చర్లు లేవు. బెడ్లు లేవు. ఇక్కడ అంతా చావు కేకలే. ఇక శిథిలాల్లో బాధితులను కాపాడే దళాలూ.. ప్రమాద స్థలికి చేరలేక పోతున్నాయి. ఏ క్షణంలో ఏ భవనం కూలిపోతుందో అర్థం కాని స్థితి. మాకు ఎలాంటి సహాయం అందలేదు, రెస్క్యూ సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. అని బాధితులు వాపోతున్నారు.
చేతిలో పనిముట్లు లేవు. మేం కూలిపోయిన భవనాలను సమీపిస్తున్నాం, కానీ మేం పని చేస్తున్నప్పుడు కొన్ని నిర్మాణాలు అస్థిరంగా ఉన్నాయి, అని మండలేలోని ఇరావడ్డి నది అవతల ఓ రెస్క్యూ ఆపరేషన్ సభ్యుడు అన్నారు. మండలే, సాగైంగ్తో సహా మధ్య వాయువ్య మయన్మార్లోని కొన్ని ప్రాంతాలలోని ఆసుపత్రులు క్షతగాత్రుల ప్రవాహాన్ని తట్టుకోలేక పోతున్నాయి.
ఈ స్థితిని స్వయంగా ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం తెలిపింది.
భారత్ సహా.. కదలిన దేశాలు ..
భారత్ , చైనా , థాయిలాండ్ , మలేషియా, సింగపూర్ , రష్యా నుంచి రెస్క్యూ టీములు బయలుదేరాయి. సహాయ సామాగ్రిని ఈ దేశాలు పంపించాయి. భారత సైనిక విమానాలు శనివారం మయన్మార్లోకి అనేకసార్లు ప్రయాణించాయి, వీటిలో సామాగ్రిని తీసుకెళ్లి, రాజధాని నేపిటావ్కు రెస్క్యూ బృందాలను చేర్చాయి. మాండలేలో ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటునకు భారత సైన్యం సహాయం చేసకతోంది. సామాగ్రిని మోసుకెళ్ళే రెండు నేవీ నౌకలు మయన్మార్ వాణిజ్య రాజధాని యాంగోన్కు వెళ్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.
తాత్కాలిక ఆస్పత్రికి భారత్ ఏర్పాట్లు
తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది మయన్మార్ బయల్దేరి వెళ్తారని భారత విదేశాంగశాఖ తెలిపింది. మయన్మార్లో భూకంపాల ఘటనలో ఇప్పటి వరకు భారతీయులెవరూ మృతి చెందలేదని స్పష్టం చేసింది. భూకంప బాధిత మయన్మార్కు సహాయక సామగ్రి చేరి వేతకు భారత నౌకాదళం నాలుగు నౌకలను సిద్ధం చేయగా- ఐఎన్ఎస్ సావిత్రి, ఐఎన్ఎస్ సాత్పుర ఇప్పటికే బయల్దేరాయి.
భూకంపానికి గురైన మయన్మార్ రాజధాని మాండలే సహా నేపిటావ్ నగరాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. మయన్మార్లోని పలు విమానాశ్రయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు సహాయక సామగ్రిని, సిబ్బందిని పంపిస్తున్నప్పటికీ, ఫ్లైట్స్ లాండ్ చేయడానికి అనువుగా విమానాశ్రయాలు లేవని, అందువల్ల తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొంది.
రంగంలోకి 80 మంది ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది
సహాయక చర్యల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మయన్మార్కు పంపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద 15 టన్నుల సహాయక సామగ్రి మయన్మార్కు పంపించింది. తాజాగా మరో రెండు ఐఏఎఫ్ విమానాల ద్వారా సామగ్రిని పంపించేందుకు రెడీగా ఉన్నాయి.
ఇండోనేషియాలో కలవరం
ఇండోనేషియాను తాజాగా మరో భూకంపం కుదిపేసింది. ఆదివారం ఉదయం ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్రా దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మయన్మార్ భూకంపం గురించి టీవీలు, వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న ఇండోనేషియా వాసులు భయంతో వణికిపోతున్నారు. భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన మయన్మార్లో మృతుల సంఖ్య 1,644కు పెరిగిందని అధికారిక మీడియా తెలిపింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగుతుందని అనుమానం వ్యక్తం చేసింది.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య 3408కి పెరిగిందని, 139 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని పేర్కొంది. ఈ స్థితిలో తమకూ అలాంటి దారుణ పరిస్థితి ఎదురవుతుందనే భయంతో ఇండోనేషియా ప్రజలు