శంషాబాద్ : విమాన ప్రమాదాలు!(Flight Accident,) ప్రయాణీాకులకు దడ పుట్టిస్తున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే భయపడిపోతున్నారు. అత్యవసర పనులపై తొందరగా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకునే వారికి రోజుల వ్యవధిలోనే జరిగిన వరుస ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి tirupati ) బయలు దేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
వెంటనే అప్రమత్తమైన పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావలసిన విమానం తిరిగి (Return) శంషాబాద్ ఎయిర్పోర్టుకు (Shamshabad airport)కు మళ్లించారు. దీంతో తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు తిరిగి శంషాబాద్కు రావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ను ఏర్పాటు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు.