Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా

తిరుమల – ఏపీ ఉప ముఖ్యమంత్రి .పవన్ సతీమణి అనా కొణిదెల నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుబ్రబాత సేవలో పాల్గొన్నారు.స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ వద్ద తితిదే అధికారులు స్వాగతం పలికారు.

తమ కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. తొలుత ఆమె శ్రీభూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథిగృహంలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *