నాలుగిళ్లలో చోరీ
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జగిత్యాల రూరల్ పొలీస్ స్టేషన్ పరిధిలోని జగిత్యాల అర్బన్(Jagityala Urban) మండలం ధరూర్ దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్(Target)గా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు.
భారీగా నగదు, బంగారం(Cash and gold) ను ఎత్తుకెళ్లారని సమాచారం. ఈ రోజు గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల-కరీంనగర్(Jagityala-Karimnagar) రహదారిపై గల ధరూర్ గ్రామంలో పథకం ప్రకారమే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.