Stock Market | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

వరుసగా నాలుగోరోజు స్టాక్ మార్క‌ట్లు భారీ లాభాలతో ముగిసిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 77,500 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 258 పాయింట్లు లాభపడి 23,508 వద్ద స్థిరపడింది.

గృహోపకరణాల రంగంలోని కంపెనీలు నేటి ట్రేడింగ్‌లో 2.09 శాతం వృద్ధితో ముందంజలో ఉన్నాయి. ఆటోమొబైల్, రియాల్టీ, ఆయిల్, ఎఫ్‌ఎంసిజి షేర్లు 1 శాతం లాభపడ్డాయి. ఇక… ఐటీ, మెటల్, మీడియా షేర్లు ఫ్లాట్‌గా ముగిశాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇండస్ ఇండ్ బ్యాక్ షేర్లు లాభాల బాటలో పయనించగా, ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ హోటల్స్ నష్టాలను చవిచూశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *