The incident | భార్య గొంతు కోసి…

The incident | భార్య గొంతు కోసి…
- అతికిరాతకంగా హత్య చేసిన భర్త
The incident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భార్యను గొంతుకోసి భర్త దారుణంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న భార్య నందినిని ఆమె భర్త శ్రీహరి ఇవాళ ఉదయం రిసీవ్ చేసుకున్నాడు. అనంతరం మార్గమధ్యలో వెళుతుండగా కత్తితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశాడు. భార్య ప్రవర్తనపై అనుమానంతో గత 9నెలలుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం వారికి వివాహం కాగా, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో జరిగింది.
