- చికెన్కు దూరంగా ఉండాలంటున్న అధికారులు
తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతుండడం పట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. అధికారులు పలు గ్రామాల్లోని కోళ్లఫారంల నుంచి శాంపిల్స్ సేకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయని తేల్చారు. కానూరు గ్రామంలోని కోళ్ల ఫారం నుంచి సేకరించిన శాంపిల్స్లో బర్డ్ఫ్లూ పాజిటివ్గా తేలింది.
దీంతో ప్రజలు కొన్ని రోజులు చికెన్కు దూరంగా ఉండాలని.. చికెన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. వివరాలకు 9542908025 ఫోన్ నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.