ADB | నాణ్యమైన సరుకులు అందించడమే ధ్యేయం.. జీసీసీ రాష్ట్ర చైర్మన్ తిరుపతి

జన్నారం, జూన్ 13 ( ఆంధ్రప్రభ) : జీసీసీ సంస్థ ద్వారా గిరిజన హాస్టళ్లకు నాణ్యమైన సరుకులను అందించడమే ధ్యేయమని జీసీసీ రాష్ట్ర చైర్మన్ కోట్నాక తిరుపతి (Kotnaka Tirupati) అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని జీసీసీ కార్యాలయాన్ని, రేషన్ సరుకుల విక్రయ కేంద్రాన్ని (Merchandise sales center) శుక్రవారం సాయంత్రం చైర్మన్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంస్థ అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు.

సంస్థ ద్వారా గిరిజనులకు పంట రుణాలతో పాటు, నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. గిరిజన హాస్టళ్లకు సంస్థ ద్వారా నాణ్యమైన సరుకులను అందిస్తున్నామని, గిరిజనుల, గిరిజన విద్యార్థుల (Tribal students) అభివృద్ధే ధ్యేయంగా సంస్థ పనిచేస్తుందని, సంస్థ లోటుపాట్లను సరిచేసి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. గిరిజన రైతులకు పంట రుణాలు కూడా భూములను బట్టి ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఆయన వెంట ఉట్నూర్ జీసీసీ ఇన్చార్జి డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్, స్థానిక మేనేజర్ బాలాజీ, అకౌంటెంట్ లక్ష్మణ్,జూనియర్ అసిస్టెంట్ మర్రి పల్లి రాజ్ కుమార్, సేల్స్ మెన్ ప్రభాకర్,డీఇఓ అత్తే మల్లేష్, తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *