సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు వీసీ.సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రధాన పుష్కర ఘాట్లకు ఈ బస్సులు అందుబాటులో ఉండేలా ప్రణాళిక వేసినట్లు తెలిపారు.
జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
కాగా, 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలనుకుంటే, వారి కాలనీలకు ప్రత్యేక బస్సులను పంపడానికి ఏర్పాట్లు చసినట్టు ప్రకటించారు. అటువంటి ప్రత్యేక బస్సులలో ముందస్తు రిజర్వేషన్ల కోసం, http://tgsrtcbus.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.