వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు..

వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు..
పట్టించుకోని అధికారులు
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు చివర ఉన్న గాజుల సావిత్ర ఇంటి ముందు ఉన్న మిషన్ భగీరథ పైపు పగలడంతో నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మిషన్ భగీరథ ఏఈ పట్టించుకోకపోవడం పై గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. నెల రోజుల నుండి నీరు వృథాగా పోతున్న పట్టించుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మిషన్ భగీరథ అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు.వేసవికాలంలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇలా నీటిని వృథా చేయడమేంటని ప్రశ్నస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

