సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం దాదాపు 6 గంటల పాటు జరిగింది. సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రధాన అంశాలు:
🔹 కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధతకు మంత్రివర్గ ఆమోదం
🔹 మెట్రో రైల్ ఫేజ్-2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన పై చర్చ
🔹 ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్ట్ లో మార్పులు
🔹 భూభారతి మార్గదర్శకాలు, LRS, మైనింగ్ యాక్ట్ పై చర్చ
🔹 ఎక్సైజ్ పాలసీ మార్పులు, ధరల పెంపు పై ఎక్సైజ్ శాఖ నివేదిక
🔹 ఎండోమెంట్ యాక్ట్ సవరణ, నూతన టూరిజం పాలసీ, ఎకో టూరిజం పై చర్చ
🔹 ఇందిరా మహిళా శక్తి అమలు, మహిళా సాధికారత కోసం కొత్త విధానం
🔹 తాగునీరు – సాగునీటి అవసరాలు, నూతన & పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
తీసుకున్న కీలక నిర్ణయాలు:
🔹 రానున్న రోజుల్లో భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం.
🔹 నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం.
🔹 ముందుగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు నియామకానికి గ్రీన్ సిగ్నల్.
🔹 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు.
🔹 10 జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 55 ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం.
🔹 ఉగాది నుంచి భూ భారతి అమలు చేయాలని నిర్ణయం.
🔹 ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు.
🔹 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి
🔹 ఫ్యూచర్ సిటీ కోసం 90 పోస్టులుకు ఆమోదం
🔹 HMDA పరిధి విస్తరణ..
🔹 HMDA పరిధిలోకి 332 రెవెన్యూ గ్రామాలు
🔹 సెర్ప్, మెప్పా విలీనం
🔹 గ్రామపరిపాలన అధికారుల నియామకానికి ఆమోదం
🔹 ఒక్కో రెవన్యూ గ్రామానికి ఒక జీపీవో
🔹 యాదగిరి గుట్ట బోర్డుకు ఆమొదం
🔹 హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఆమోదం
🔹 బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే బిల్లు ఆమోదం
🔹 రాయికుంటలో 100 పడలక ESI ఆసుపత్రి
🔹 ఇందిరమ్మ మహిళ శక్తి మిషన్ 2025 పాలసీకి ఆమోదం
🔹 తెలంగాణ టూరిజం పాలసీకి ఆమోదం
🔹 పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం