మహబూబాబాద్ రూరల్ మే 28 (ఆంధ్రప్రభ)విద్యుత్ షాక్ తగిలి, కంప్యూటర్ కోచింగ్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతానికి చెందిన కార్తీక్ (16 సంవత్సరాలు) అనే విద్యార్థి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డిడి నాయక్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు, అయితే ఈ శిక్షణ కేంద్రంలో వసతి గృహం సౌకర్యం ఏర్పాటు చేయగా కంప్యూటర్ నేర్చుకుంటూ ఉంటున్నాడు
, సుమారు 7 గంటల సమయంలో దండం తీగపై బట్టలు తీస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగలగా వెంటనే చికిత్స కోసం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు, ఈ విషయం తెలుసుకున్న టౌన్ పోలీసులు, ఆసుపత్రికి చేరుకొని కార్తీక్ మృతి దేహాన్ని పరిశీలించారు, కార్తీక్ మృతి చెందిన విషయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగిందని స్థానికులు తెలిపారు..