- రూ. 10 లక్షల ఆస్తి నష్టం
- పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో ఘటన
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని చిన్న మసీదు సమీపంలో ఉన్న పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో (మంగళవారం) రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రహించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.
మంటల్లో పేపర్ ప్లేట్ల తయారీ కి సంబంధించిన యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు పది లక్షల రూపాయల మెటీరియల్ బూడిదయింది. కాగా, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన సమాచారం అందుకున్న పెద్దపల్లి సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.