TG |బ్రెజిల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు స్టార్టప్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ మరో కీలక ఒప్పందం చేసుకుంది.
అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి టీ హబ్ , బ్రెజిల్ కు చెందిన గోయస్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేసే హబ్ గోయస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. ఆ సంస్థ ప్రతినిధులతో నేడు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఈ సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం టీ హబ్ సి ఈ ఓ ఆజిత్ జాగిర్దార్, గోయస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రెటరీ జోస్ ప్రెడెరికో లైరా నెట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు మన రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనాకు వచ్చారు.
ప్రధానంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.మార్కెట్ యాక్సెస్తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై టీ-హబ్ , హబ్ గోయస్ కలిసి పని చేస్తాయని.. రెండు దేశాల స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేయనుందని వెల్లడించారు.