కరీంనగర్ – కల్వకుంట్ల ఆర్ట్ ప్రోడక్షన్ లో తెలంగాణ చార్ పత్తా సినిమా నడుస్తుందన్నారు కేంద్ర మంత్రి బండిసంజయ్. ఈ సినిమాలో కవిత, కేటిఆర్, సంతోష్ , హరిష్ రావులు చార్ పత్తా అయితే కెసిఅర్ జోకర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ డైరెక్షన్ లో కవిత లేఖల డ్రామా నడుస్తున్నదని వ్యాఖ్యానించారు.. కరీంనగర్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ,
కవిత లెటర్ పై చర్చ కాంగ్రెస్ డ్రామా అంటూ తేల్చి పారేశారు. బీఅర్ఎస్, బిజేపి పార్టీలో కలవదని అంటూ కవిత అరెస్టుని అపడానికి బిజేపి తో కలవాలని చూసినప్పుడే దగ్గరికి రానివ్వలేదని గుర్తు చేశారు బండి సంజయ్.. బీఅర్ఎస్ అవినీతి ,కుటుంబ పార్టీ అని అంటూ అటువంటి పార్టీని తాము దగ్గరకు రానివ్వబోమని అన్నారు. కాంగ్రెస్, బిఅర్ఎస్ అడ్టుకున్నా బిజేపి ప్రస్థానం అగదని, అంటూ ఇప్పటికే తెలంగాణ ప్రజలు అందరికి అధికారం ఇచ్చారని, తాజాగా బిజేపికి అవకాశం ఇద్దామని తెలంగాణ సమాజం ఉందని అన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయమంటే ..
కాంగ్రెస్ వంద రోజులలో అరు గ్యారంటీలని అటకెక్కించిందని, .. అరు గ్యారంటీలు అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తుందని మండిపడ్డారు బండి సంజయ్.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. వరిధాన్యంకి బోనస్ ఇస్తానని సన్నధాన్యంకే బోనస్ ఇస్తుంది.. పద్దెనిమిది నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్ళ కోసం కేంద్రం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు ఇచ్చిందని అన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు..
అటకెక్కిన కేసులు ..
ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ ల కేసులు పత్తా లేకుండా పొయాయన్నారు బండి సంజయ్.. మూటలు తీసుకెళ్ళి ఢిల్లీకి కప్పం కడుతున్నారని తెలిపారు.. రాజన్న కోడెల మరణాల విషయంపై మాట్లాడుతూ.. కోడెలని రక్షించాల్సిన బాధ్యత రాజన్న దేవస్థానందేనని అన్నారు. కోడెలని రక్షించడానికి సరైనా ప్రణాళికలు రూపోందించాలన్నారు.. కోడెలు ఉంచే గదుల సంఖ్యలని పెంచాలని సూచించారు..
రేవంత్ వ్యాఖ్యాలపై రుస రుస
ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులని కించపరిచే విధంగా ఉందన్నారు. అర్మీ ఛీప్ మీద విశ్వాసం లేదా అని ప్రశ్నించారు.. పహల్గాం సంఘటన జరిగిన పదిహేను రోజులలోనే ఉగ్రవాదులని చంపామని, .. ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని అన్నారు.. అపరేషన్ సింధూర్ కొనసాగుతుందన్నారు. పీవోకే ని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు.